భోపాల్: పొరుగింట్లో లోదుస్తులు దొంగిలించిన ఒక యువకుడ్ని గదిలో బంధించగా ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ ఘటన జరిగింది. 17 ఏండ్ల యువకుడు గాంధీనగర్లో నివాసం ఉంటున్న తన కజిన్ ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి పొరుగింటి వారికి చెందిన లోదుస్తులు దొంగిలించాడు. గమనించిన పొరుగింటి దంపతులు రవి, అతడి భార్య ఆ యువకుడ్ని వెంబడించారు. కాగా, అతడు పరుగెత్తి తన కజిన్ ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
దీంతో ఆ దంపతులు ఆ గదికి బయట నుంచి లాక్ చేశారు. యువకుడి సోదరుడు, పోలీసులకు వారు ఫోన్ చేశారు. పోలీసులు అక్కడకు వచ్చి తలుపు తెరువగా ఆ యువకుడు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. అక్కడ ఉన్న దొంగిలించిన లోదుస్తులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువకుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు.
మరోవైపు కజిన్ ఫిర్యాదుతో యువకుడి ఆత్మహత్యకు కారణమైన పొరుగింటి దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాము యువకుడ్ని పోలీసులకు పట్టించేందుకు గదికి లాక్ చేశామని, అతడి ఆత్మహత్యకు తాము బాధ్యులం కాదని ఆ దంపతులు, వారి బంధువులు వాదించారు.