సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): వరుస పండుగలు రాబోతుండటంతో పోస్టాఫీస్ ‘డాక్ పార్సిల్ మహోత్సవ్’ సర్వీస్ను ప్రారంభించింది. స్నేహితులు, బంధువులకు పండుగ నేపథ్యంలో పంపించాల్సిన గిఫ్టులు, ఇతర వస్తువులను చేర్చేందుకు తపాల శాఖ సిద్ధమైంది. శనివారం నుంచి జనవరి 15 వరకు ‘డాక్ పార్సిల్ సేవలు’ కొనసాగుతాయని హైదరాబాద్ రీజన్ అసిస్టెంట్ డైరెక్టర్ జె.శ్రీనివాస్ శుక్రవారం పేర్కొన్నారు. దసరా, దీపావళి, గురునానక్ జయంతి, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వరుస పండుగలు రాబోతున్న కారణంగా వినియోగదారులకు సేవలందించాలనే ఉద్దేశంతో ఈ సేవలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు.
పూర్తిగా కరోనా జాగ్రత్తలు పాటించి పార్సిల్ వస్తువులను అందిస్తామని అన్నారు. ప్రతి పోస్టాఫీసు కేంద్రంలో కరోనా జాగ్రత్తలు అన్నీ తీసుకుంటారని చెప్పారు. పార్సిల్ ఆర్డర్ సంబంధిత అడ్రస్కు చేరే వరకు సమాచారం అంతా పోస్ట్ ఇన్ఫో యాప్ ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు. దేశ, విదేశాల్లో ఏ అడ్రక్కైనా చేరవేసే సదుపాయం కల్పించామన్నారు. ఈ సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు. ప్యాకింగ్ వసతి హైదరాబాద్తో పాటు హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్లో ఉంటుందని చెప్పారు.