సిటీబ్యూరో, జూన్ 9( నమస్తే తెలంగాణ ) : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అత్తాపూర్లో మసాబ్ ట్యాంక్ సర్వీస్ స్టేషన్ పేరుతో కంపోస్ట్ బయోగ్యాస్ స్టేషన్ని బుధవారం ప్రారంభించింది. ఈ వర్చువల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. వీరితో పాటు ఐఓసీఎల్ చైర్మన్ ఎస్ఎం వైద్య, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ఎస్ఎస్ రావు, రిటైల్ సేల్స్ చీఫ్ జనరల్ మేనేజర్ అనిల్కుమార్, డివిజనల్ సేల్స్ హెడ్ వేణుగోపాల్ పాల్గొన్నారు.