సిటీబ్యూరో, జూన్22 (నమస్తే తెలంగాణ): ప్రజా సంక్షేమం కోసమే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ ప్రొఫెసర్ కృష్ణస్వామి విజయరాఘవన్ నొక్కి చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ హెచ్) 13 వ్యవస్థాపక దినోత్సవాన్ని డైరెక్టర్ బీఎస్ మూర్తి నేతృత్వంలో మంగళవారం నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో వర్చువల్ విధానంలోనే సమావేశాన్ని నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ కృష్ణస్వామి విజయరాఘవన్ పాల్గొన్నారు. ‘ైక్లెమెట్ చేంజ్, బయోడైవర్సిటీ లాస్, ఫ్యూచర్ ఆఫ్ ఇంజినీరింగ్’ అంశాలపై ఆయన ప్రసంగించారు. అనంతరం అధ్యాపకులు, పలువురు విద్యార్థులకు అకాడెమిక్, రీసెర్చ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఐఐటీ హెచ్ గవర్నర్ల బోర్డు చైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి పాల్గొన్నారు.