కురవి, సెప్టెంబర్ 28: భారత ఆర్మీ క్రమశిక్షణకు మారుపేరని నేటి యువత భార త సైన్యంలో చేరాలని జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతమ్ అన్నారు. భారత్-ఇండియా 1971 యుద్ధంలో విజయాన్ని సాధించి యాబై ఏళ్లయిన సందర్భంగా హైదరాబాద్లోని ఏవోసీ సెంటర్ భారత ఆర్మీ సైక్లిస్టులు చేపట్టిన 1300 కిలోమీటర్ల సైకిల్ యాత్ర మంగళవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చేరుకుంది. దీంతో యువత భారీ ఎత్తున సైకిల్ యాత్రికులకు స్వాగతం పలికారు. కల్నల్ శ్రీనివాసరావు, రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర పూలమాలలు వేసి స్వాగతించారు. భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామిని యాత్రికులు దర్శించుకున్నారు. అనంతరం జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఏఎస్పీ యోగేశ్ గౌతమ్ మాట్లాడారు. 14 రోజుల్లో పాక్తో యుద్ధం చేసి విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. పాక్ మెడలు వంచి బంగ్లాదేశ్ కు విముక్తిని ప్రసాదించడం జరిగిందన్నారు. అనంతరం సైకిల్ యాత్రికులను సన్మానించారు. కార్యక్రమంలో యాత్ర కో-ఆర్డినేటర్ కల్నల్ లక్ష్మణ్సింగ్, ఆలయ చైర్మన్ రాము నాయక్, ఎంపీడీవో ధన్సింగ్, తహసీల్దార్ విజయ్ కుమార్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవినాయక్ క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.