ఖలీల్వాడి, జనవరి 5 : నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 7 కేసులు నమోదు కాగా బుధవారం ఒక్కసారిగా ఆ సంఖ్య 18కి చేరింది. వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా రు. ఇప్పటికే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరుతున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శుభకార్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. బుధవారం నాటికి జిల్లాలో మొత్తం 55658 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో సుదర్శనం తెలిపారు.
టీనేజర్లకు ముమ్మరంగా వ్యాక్సినేషన్
నిజామాబాద్ జిల్లాలో 15 నుంచి 17 సంవత్పరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. మూడోరోజైన బుధవారం మొత్తం 10,555 మందికి టీకా వేశామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 24,203 మందికి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు వెల్లడించారు.