మెహిదీపట్నం : చిన్నారుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి కృషి చేయాలని ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం శాసనమండలి ఆవరణలో చిన్నారులు కరాటే విన్యాసాలను ప్రదర్శించారు. అనంతరం వారికి ప్రొటెం స్పీకర్ భూపాల్ రెడ్డి, ప్రభుత్వవిప్ ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావుతో కలిసి సర్టిఫికెట్లను అందచేశారు.
ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులకు ఉన్న ఆసక్తిని గ్రహించి వారికి ఆయా అంశాలలో శిక్షణ ఇస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గం ఇంఛార్జి సీహెచ్.ఆనంద్ కుమార్గౌడ్, నిర్వాహకులు శశాంక్రావు, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.