దుండిగల్, ఫిబ్రవరి 3: సముద్రతీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, నేవీ సిబ్బందికి ఇన్కాయిస్ అందిస్తున్న సేవలు అమోఘమని భారత భూ ఉపరితల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా. ఎం.రవిచంద్రన్ అన్నారు. ప్రగతినగర్లోని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం (ఇన్కాయిస్) 25వ వ్యవస్థాపక వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రవిచంద్రన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సునామీ, తుపాన్ వంటి విపత్తులను ముందుగానే పసిగట్టి తీరప్రాంత ప్రజలు, ప్రభుత్వానికి చేరవేయడంలో ఇన్కాయిస్ విశేష సేవలు అందిస్తున్నదన్నారు.
అనంతరం ఆయన నేషనల్ ైగ్లెడర్ ఆపరేషన్స్ కార్యాలయంతో పాటు 72 సీట్ల సామర్థ్యంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన ఈ-క్లాస్ రూమ్ను ఆవిష్కరించారు. అదే విధంగా ఓషన్ శాట్-3 డేటా ఆక్విజిషన్, ప్రాసెసింగ్ ప్రాంగణాన్ని డా. ఎస్.చంద్రశేఖర్ ప్రారంభించగా, ఇన్కాయిస్ మాజీ డైరెక్టర్ డా. షెనాయ్ కొత్తగా ఏర్పాటు చేసిన మెరైన్హీట్ సర్వీస్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.