హైదరాబాద్ : లక్షణాలేవి లేకుండా కొవిడ్-19 బారిన పడిన పోలీసు సిబ్బంది కోసం హైదరాబాద్ సిటీ పోలీసుల సహాయంతో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ సహాయలో భాగంగా పేట్లబుర్జ్లోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఈ ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. కొవిడ్ పాజిటివ్కు గురై ఐసోలేషన్ సౌకర్యాలు లేని పోలీసు సిబ్బంది కోసం ఈ కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, అడిషన్ కమిషనర్ ఆఫ్ పోలీసు శిఖా గోయల్, అడిషన్ సీపీ ట్రాఫిక్ అనీల్ కుమార్, అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్ డీ.ఎస్.చౌహాన్, సెక్రటరీ జనరల్ డాక్టర్ పి.ప్రశాంతి, హెచ్సీఎస్సీ సలహాదారు భరణి అరోల్, పోలీసు విభాగపు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కొవిడ్తో బాధపడే పోలీసు సిబ్బందిని 24 గంటలు పర్యవేక్షించేలా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.