నామినేషన్ల ఘట్టం షురూ
ప్రక్రియను పరిశీలించిన కమిషనర్ పమేలా సత్పతి
సెంటర్ల వద్ద నాయకుల కోలాహలం
పెద్ద సంఖ్యలో పత్రాలు తీసుకెళ్లిన ఆశావహులు.. ఆలయాల్లో పూజలు
వరంగల్, ఏప్రిల్ 16: గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం శుక్రవారం మొదలుకాగా, తొలిరోజు వివిధ పార్టీల తరఫున 14మంది నామినేషన్లు వేశారు. వరంగల్లోని ఎల్బీ కళాశాలలో తూర్పు, పరకాల నియోజకవర్గాల పరిధిలోని 32 డివిజన్ల నామినేషన్లను స్వీకరించారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పశ్చిమ, హసన్పర్తి పరిధిలోని 34 డివిజన్ల నామినేషన్లు తీసుకున్నారు. ఉదయం 10. 30 గంటలకు ప్రక్రియ ప్రారంభం కాగా, ప్రతి డివిజన్కు ఒక్కో గది ఏర్పాటు చేశారు. డిపాజిట్ చెల్లింపు కోసం ప్రత్యేక కౌంటర్ పెట్టారు. నామినేషన్ల ప్రక్రియను కమిషనర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఎల్బీ, ఆర్ట్స్ కళాశాలలను సందర్శించి నామినేషన్ల తీరు తెన్నులను తెలుసుకున్నారు. సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్ను ఆదేశించారు.
ఒక్కో సెంటర్లో ఏడు..
తొలిరోజు 14 నామినేషన్లు దాఖలు కాగా, ఎల్బీ కళాశాలలో 7, ఆర్ట్స్ కళాశాలలో 7 పడ్డాయి. టీఆర్ఎస్ తరఫున 39వ డివిజన్ నుంచి కొమ్మిని సురేశ్, 32వ డివిజన్ నుంచి బొల్లం శ్రీదేవి, 31వ డివిజన్ నుంచి వేల్పుల మోహన్రావు, 61వ డివిజన్ నుంచి పాతి సంపత్రెడ్డి నామినేషన్ వేశారు. బీజేపీ తరఫున 34, 35 డివిజన్ల నుంచి గంటా రవికుమార్, 27వ డివిజన్ నుంచి చింతాకుల అనిల్, 30వ డివిజన్ నుంచి రావుల కోమల దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున 23వ డివిజన్ నుంచి చిప్ప లక్ష్మి, 4వ డివిజన్ నుంచి రేపల్లె శ్రీరంగనాథ్, 6వ డివిజన్ నుంచి బొమ్మతి విక్రమ్ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా 2వ డివిజన్ నుంచి డాక్టర్ బానోత్ సుధీర్, 53వ డివిజన్ నుంచి క్రాంతికుమార్రెడ్డి, 52వ డివిజన్ నుంచి పుప్పాల రజినీకాంత్ దాఖలు చేశారు. కాగా తొలిరోజున ఆశావహులు పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలను తీసుకెళ్లి ఆలయాల్లో పూజలు చేశా రు. ఒక్కో డివిజన్ నుంచి 10మంది వరకు పత్రాల ను తీసుకున్నారు. కొందరు డిపాజిట్ కూడా చెల్లించి రసీదులు తీసుకున్నారు. దీంతో నామినేషన్ కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది.
ఇవి కూడా చదవండి
ఐశ్వర్య నాపై ఫోకస్ పెట్టింది: అభిషేక్ బచ్చన్
దేశీయ సంస్థలకు సిటీ బ్యాంక్ బెస్ట్ చాన్స్.. ఎందుకంటే!