మియాపూర్ : కొవిడ్తో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. కొవిడ్తో మరణించిన వారికి ప్రభుత్వ పరంగా రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను అందిస్తుందని ఇందుకు గాను మీసేవా, సర్వీస్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
బుధవారం విప్ గాంధీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొవిడ్తో సంభవించిన మరణాలకు సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ మొత్తం కుటుంబానికి కొంతమేర ఆర్థిక తోడ్పాటుగా నిలుస్తుందన్నారు.
మృతుడి డెత్ సర్టిఫికెట్, ఆధార్కార్డు, కొవిడ్ నిర్ధారణ సర్టిఫికెట్, బ్యాంకు పాస్ బుక్ జీరాక్సు, ఫోన్ నంబర్లతో వెంటనే మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని విప్ గాంధీ కోరారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజులలో బాధిత కుటుంబానికి ఈ ఎక్స్ గ్రేషియా మృతుడి ఆధార్తో అనుసంధానం ఉన్న బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని విప్ తెలిపారు.