ఖైరతాబాద్, జూలై 28 : ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ అరుదైన గుర్తింపును పలువురు సీనియర్ ఇంజినీర్లు అందుకున్నారు. ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్యభవన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం కార్యాలయం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఐఅండ్క్యాడ్ విభాగం విశ్రాంత ఎస్ఈలు సత్తిరెడ్డి, జియావుద్దీన్, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ ప్రశాంత్ బిక్కసాని, వాటర్ వర్క్స్ ఇంజినీరింగ్ విభాగం మేనేజర్ టి.స్ఫూర్తిలకు ఐఈఐ ఫెలోషిప్ సర్టిఫికెట్లను ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్టీయూ హైదరాబాద్ ఉప కులపతి ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఇనిస్టిట్యూషన్లో సభ్యత్వం పొందడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఈఐ చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్ బి.రమణా నాయక్, కార్యదర్శి టి.అంజయ్య, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ప్రసాద్ రెడ్డి, తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ చైర్మన్ తన్నీరు వెంకటేశం, ఈసీఎం చైర్మన్ ఇ.శ్రీనివాస చారి, డాక్టర్ ఎంవీ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.