నిజామాబాద్ : జిల్లాలోని బోధన్లో టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా రూ.10 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తీకేయ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ టాస్క్ఫోర్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ షకీర్ అలీ తన బృందంతో కలిసి ఓ ఇంటిపై రైడ్ చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నిందితుడు ఈ గుట్కాను తెప్పించినట్లుగా సమాచారం. నిందితుడు లతీఫ్ను అరెస్టు చేసి గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.