కుత్బుల్లాపూర్, మార్చి 27 : తాను స్థానికుడిగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా..అడుగు తీసి వేయాలంటే బురదమయమైనా రోడ్లు.. ఎండా కాలం వస్తే గుక్కెడు నీటి కోసం ట్యాంకర్ల వద్ద పడిగాపులు..కరెంటు ఎప్పుడోస్తుందో తెలియని అయోమయ పరిస్థితి..వానలొస్తే బస్తీలంతా ఆగమాగంతో నిత్యం మనోవేధనకు గురయ్యాను. దీంతో పట్టుదలతో ప్రజలకు సేవ చేయాలని వచ్చాను.
వారిచ్చిన ఆశీర్వాదంతోనే గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో నియోజకవర్గాన్ని ఆద్దంలా తీర్చిదిద్దే అవకాశం దక్కింది. కోట్ల నిధులతో అడుగడుగు నా రోడ్లు, పొంగిపొర్లే డ్రైనేజీలకు శాశ్వత పరిష్కారం..ఆడపడుచు బిందె పట్టుకొని బయట కాలు పెట్టకుండా ఉండే లా మిషన్ భగీరథతో ఇంటింటికి గోదావరి జలాలు ..ఇప్పుడే ఎక్కడ చూసినా అభివృద్ధే..ఇదే కదా ప్రజలు కోరుకున్న నిజమైన పరిపాలన ..మీ ఇంటి బిడ్డలా ఇంటి ని చక్కదిద్దుతున్నా.. ఇలా ప్రజల సమష్టి సహాకారంతో సుపరిచిత పాలనతో ముందుకు వెళ్తున్నానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తాను చేపట్టిన ‘ప్రగతియాత్ర’లో ప్రజలతో ముఖాముఖితో చర్చించి.. తనదైన ముద్ర వేసుకుంటున్నారు. సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ డివిజన్ పరిధిలో వల్లభాయి పటేల్నగర్, సిక్కుల బస్తీలో పర్యటించి పూర్తైన సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించి, స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చినా మిగిలి ఉన్న సమస్యల పరిష్కారం కోసం రూ.50 లక్షల ప్రణాళికలతో నిర్మాణ పనులకు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఈఈ శిరీష, ఏఈ సంపత్, డీజీఎం విష్ణుప్రసాద్, సీనియర్ నాయకులు శేఖర్రావు, బస్వరాజు, ప్రభాకర్గుప్తా, శమీమ్బేగం, సుదర్శన్రెడ్డి, ఐలయ్యయాదవ్, కుమార్ యాదవ్, మోహన్రెడ్డి, సంపత్యాదవ్, నాగిరెడ్డి, నర్సింహాశెట్టి, బాలమణి, సునీత, మల్లేశ్యాదవ్, ఇర్ఫాన్, వెంకటేశ్, సునీల్కాలే, శివముదిరాజ్, బల్బీర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.