సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): మంజీరా నీటి సరఫరా ఫేజ్-2లో 1500 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్ను మార్చేందుకు జంక్షన్ పనులను చేపట్టడం, పటాన్చెరు నుంచి హైదర్నగర్ వరకు గల పంపింగ్ మెయిన్లైన్, ఎంఎస్ పైప్లైన్, మదీనగూడ వద్ద నీటి కాలువ, ఇతర లీకేజీ, నిర్మాణ పనుల కారణంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ఎండీ దానకిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. 15వ డివిజన్లోని గంగారాం, దీప్తీశ్రీనగర్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్, అపర్ణహిల్స్, ఆదర్శనగర్, శాంతినగర్, మియాపూర్, మైత్రినగర్, మదీనాగూడ, ఉషోదయ నగర్, వైశాలినగర్, రామకృష్ణ నగర్, సాయిరాంకాలనీ, మియాపూర్క్రాస్ రోడ్స్, మాతృశ్రీ నగర్, రాజారాం కాలనీ, అంబేద్కర్ నగర్, జనప్రియ ఫేజ్ -1 అండ్ 2, మియాపూర్ విలేజ్, మాధవ్నగర్, భానుటౌన్షిప్, నంది కో ఆపరేటివ్ సొసైటీ, హుడా, మయూరీనగర్, ఎస్సీ బోస్ కాలనీ, సిర్లా గార్డెన్స్, ఆర్బిర్ బాలాజీ నగర్, అదిత్య నగర్, శ్రీరంగపురం ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. డివిజన్ నంబర్-9లో హైదర్నగర్, అడ్డగుట్ట, నిజాంపేట్ మెయిన్రోడ్, కేపీహెచ్బీ కాలనీలోని వసంత్ నగర్, రామ్ నరేశ్నగర్, 32 డివిజన్లోని బొల్లారం మున్సిపాలిటీ, ఐలాపూర్ గ్రామం, గండిగూడెం, సుల్తాన్పూర్, కిష్టారెడ్డిపేట్, పటేల్గూడ గ్రామం, 6వ డివిజన్లోని ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో లో ప్రెషర్తో నీటి సరఫరా ఉంటుందని వెల్లడించారు.