గ్రేటర్ రహదారులపై ప్రయాణం సాఫీగా సాగుతున్నది. గతుకులు లేని ప్రయాణమే లక్ష్యంగా మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) కింద సుమారు రూ. 1839 కోట్లతో 709.49 కి.మీ. రోడ్లను ఆధునీకరించేందుకు పనులను కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పగించారు. ఏడు ప్యాకేజీలుగా విభజించి ఇప్పటివరకు రూ.457 కోట్లు ఖర్చు చేసి 381.83 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. సీఆర్ఎంపీ రోడ్లు మినహా గ్రేటర్వ్యాప్తంగా 9013 కి.మీ. రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 2846 కిలోమీటర్లు బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్లు సీసీ రోడ్లను పటిష్టం చేస్తున్నారు. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో డీసీలు, ఈఈలు, పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి నిరంతరం పనులు తనిఖీ చేస్తుండడంతో జవాబుదారీతనం పెరిగింది.
గ్రేటర్ రహదారులు అద్దంలా మెరిసిపోతున్నాయి.. ఎక్కడా గుంతలు లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ప్రతి ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. రోడ్ల నిర్వహణలో జీహెచ్ఎంసీ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) కింద పనులు సుమారు రూ. 1839 కోట్లతో 709.49 కిలోమీటర్ల మేర రహదారులను ఆధునీకరించేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు పనులు అప్పగించారు. ఇందులో భాగంగానే తొలి విడుతలో ఏడు ప్యాకేజీలుగా విభజించి 381.83.76 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశారు. ఇప్పటి వరకు రూ. 457 కోట్లు ఖర్చు చేశారు.
సీఆర్ఎంపీ రోడ్లు మినహా గ్రేటర్లో 9013 కిలోమీటర్ల రహదారులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 2846 కిలోమీటర్లు బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్లు సీసీ రోడ్లను పటిష్టం చేస్తున్నారు. బీటీ రోడ్లు త్వరగా పాడవుతుండడంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో వీడీసీసీ (వ్యాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్) రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. రహదారుల నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పకడ్బందీ చేపడుతూ ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే 2019-20 వార్షిక సంవత్సరంలో రూ. 287. 41కోట్లతో 1888 కిలోమీటర్ల మేర పనులు చేపడితే 2020-21 సంవత్సరంలో రికార్డు స్థాయిలో పనులను చేపట్టారు.
4309 కిలోమీటర్ల రోడ్డు పనులకు అనుమతి తీసుకోగా, ఇందుకు రూ.1055.15కోట్లు అంచనా వ్య యంతోరెండు విభాగాలుగా తీసుకుని పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే 1866 పనులకు రూ. 411. 42 కోట్లు ఖర్చు చేయగా, రెండో విడుతగా రూ.2443 కోట్ల పనులను రూ. 643.74 కోట్ల పనులు తుది దశకు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో రహదారులను పటిష్టం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని, నీరు నిలిచే ప్రాంతాల్లో తరుచూ గుంతలు ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అధికారులు తెలిపారు.
జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, పోలీస్ అధికారుల బృందాలుగా ఏర్పడి పనులను పర్యవేక్షిస్తున్నారు. మరమ్మతు పనుల్లో భాగంగా మిషనరీ, మెటీరియల్, ట్యాంకర్లు, మిక్సింగ్ ప్లాంట్ల అనుమతులకు ఎలాంటి అవాంతరాలు రాకుం డా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రోజువారీగా కమిషనర్ లోకేశ్కుమార్ రోడ్ల పనుల ప్రగతిని పర్యవేక్షిస్తున్నారు. రహదారులు నిర్వహణ బాగలేదంటే సదరు ఏఈ (కేత్రస్థాయిలో ఇంజినీర్లు) బాధ్యులు చేస్తూ తాజా గా కమిషనర్ లోకేశ్కుమార్ ఇటీవల సర్క్యూలర్ సైతం జారీ చేశారు. రహదారుల గుంతలను పూడ్చడంలో నిర్లక్ష్యం వహించిన ఏఈలకు తొలుత నోటీసులు జారీ చేయ డం, సదరు అధికారి వివరణ ఆధారంగా జరిమానా విధించనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులకు వెనుకాడబోమని కమిషనర్ స్పష్టంగా ఆదేశించడంతో రహదారుల నిర్వహణ పకడ్బందీ జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్గత రోడ్ల మరమ్మతులపై జీహెచ్ఎంసీ ప్రధానంగా దృష్టి సారించింది. ప్రధానంగా ఫుట్పాత్ల మరమ్మతులు, ఫుట్పాత్ రాళ్లు, డివైడర్లు , మ్యాన్హోళ్ల కవర్స్ మార్పిడి తదితర పనులకుగానూ 69 అత్యవసర బృందాలను జీహెచ్ఎంసీ రంగంలోకి దింపింది. గతేడాది నవంబరు 1 నుంచి వచ్చే మే 31 నాటి వరకు నాన్ మాన్సూన్లో భాగంగా ఈ అత్యవసర బృందాలు (ఐఆర్టీ) అంతర్గత రహదారులను మెరు గుపర్చనున్నారు. వీటితో పాటు ఇప్పటి వరకు 12944 చోట్ల రహదా రులపై ఏర్పడిన గుంతలను పూడ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.