ఛండీగఢ్ : ఒకవైపు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కొరత ఉండగా.. మరోవైపు పంజాబ్లోని రోపర్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను కెనాల్లో గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్లో పట్టుబడిన నకిలీ రెమ్డెసివిర్ను తయారుచేసే సంస్థతో ఈ బ్యాచ్ ఇంజెక్షన్లకు సంబంధం ఉన్నట్లుగా తెలుస్తున్నది.
అందిన సమాచారం ప్రకారం, పంజాబ్లోని రోపర్లోని ఒక కాలువలో 671 రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను పోలీసులు గుర్తించారు. వాటిని కాలువలో నుంచి బయటకు తీసి డ్రగ్స్ విభాగానికి సమాచారం అందించారు. వీటికి సంబంధించిన బ్యాచ్ నంబర్ ఇటీవల హిమాచల్ ప్రదేశ్లో పట్టుబడిన ఇంజెక్షన్కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. కంపెనీకి సీలు వేసిన తర్వాత ఉన్న సరుకును దాచేందుకు స్థలం లేకపోవడంతో కెనాల్లో పారేసినట్లు అనుమానిస్తున్నారు.
మధ్యప్రదేశ్ ఇండోర్లో గత నెల 15 న అరెస్టయిన డాక్టర్ వినయ్ త్రిపాఠి హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని సూరజ్పూర్లో తులిప్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని నడుపుతున్నాడు. ఇక్కడ అనుమతి లేకుండా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు తయారు చేస్తున్నాడు. హర్యానాలో పట్టుబడిన నకిలీ రెమ్డెసివిర్ కింగ్పిన్తో వీటికి సంబంధం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపి అసలైన కారకులను వెలికి తీయాలని శిరోమణి అకాలీదళ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ దల్జిత్ సింగ్ చీమా డిమాండ్ చేశారు.
రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను ఏడు కంపెనీలు తయారు చేస్తున్నాయని, అయితే రోపర్లో ఈ ఏడింటి కంపెనీలకు స్టాకిస్టులు లేరని డ్రగ్ ఇన్స్పెక్టర్ తేజిందర్ సింగ్ తెలిపారు. కాలువలో లభించిన రెమ్డెసివిర్ 671 ఇంజెక్షన్లు గుర్తించి తమకు అందించగా దర్యాప్తు జరిపి అవి నకిలీగా తేల్చినట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో సఫాప్రజోన్ 1,456 యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు కూడా కనుగొన్నారు. 849 అన్లీడెడ్ ఇంజెక్షన్లు కూడా ఉన్నాయి. వీటి ప్రింట్లు నీటిలో కొట్టుకుపోయాయి.
టోక్యో ఒలింపిక్స్పై కరోనా పంజా: రద్దు చేయాలంటూ ప్రధానికి విజ్ఞప్తి
కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం.. భారతీయులకే ఎక్కువ ప్రయోజనం
ఆన్లైన్ బుక్ చేసుకుంటే.. ఆక్సిజన్ హోం డెలివరీ..
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
మే 15 వరకు బీహెచ్యూ మూసివేత.. జూన్ 30 వరకు పరీక్షలు రద్దు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..