చిన్నంబావి, జూలై 8 : ‘పొత్తుల సద్దిలో బలవంతుడే ఎక్కువగా తింటాడు’ అన్న చందంగా.. సమైఖ్య రాష్ట్రంలో 60 ఏండ్ల పాటు ఆంధ్రా నా యకులు కృష్ణానీటిని అధికంగా వినియోగించుకున్నారు.. రాష్ట్రం విడిపోయినా ఇప్పుడు కూడా దో చుకుంటామంటే ఇకపై కుదరదు.. ఏపీ ప్రభుత్వం ఇకనైనా తీరు మార్చుకోవాలి’.. అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశా రు. గురువారం చిన్నంబావి మండలం అమ్మాయిపల్లి, బెక్కెం గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను ఎంపీ రాములు, ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్రెడ్డి, వనపర్తి జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ 1985లో బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు భీమానదిలో కేటాయించిన 20 టీఎంసీల వినియోగానికి తగ్గట్లు ఉ మ్మడి రాష్ట్రంలో ఆంధ్రా నాయకులు ఆనకట్ట ని ర్మించలేదన్నారు.
భీమాపై 2004 నుంచి 2009 మధ్యలో కరెంటు వినియోగంతో నడిచే రెండు ఎ త్తిపోతలు భీమా ఫేస్-1, ఫేస్-2 ఎత్తిపోతల పథకాలు నిర్మించినట్లు తెలిపారు. భీమా కేటాయింపుల్లో 15 వేల ఎకరాలకు మించి నీటిని వినియోగించలేక పోతున్నామన్నారు. భీమా 27 ప్యాకేజీ ద్వారా ఈ ప్రాంతానికి నీటిని అందించడానికి కృషి చేశామన్నారు. జూరాల ఆనకట్ట ద్వారా 20 టీఎంసీల నీటి వినియోగం కేటాయింపులు ఉన్నా ప్రస్తుతం కేవలం 6.5 టీఎంసీలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 38 టీఎంసీల నికర జలాల వినియోగానికిగానూ కేవలం కృష్ణా జలా ల్లో 6.5 టీఎంసీలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని జూరాల, భీమా మీద గతంలో నికర జలాల వినియోగం కేటాయింపు సామర్థ్యానికి లోబడే వెలటూరు-గుందిమల్ల మ ధ్య కృష్ణానదిపై జోగుళాంబ బ్యారేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించినట్లు చెప్పా రు. ఈ బ్యారేజీని కృష్ణాలో తుంగభద్రనది సంగమానికి ఎగువన ఉన్న అలంపూర్ నియోజకవర్గ గ్రామాలు, మరోవైపు కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గ గ్రామాల మధ్య నిర్మించాలన్నది ఇంజినీరింగ్ అధికారులు సర్వేచేసి ఖరారు చేస్తారని వివరించారు.
రాష్ర్టానికి నీటి కేటాయింపు విషయం లో ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదని, ఎప్పుడూ స ర్కారుకు అండగా నిలబడలేదన్నారు. చిన్నంబావిలో ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవన సముదాయం నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పెద్దమరూరులో విద్యు త్ ఉపకేంద్రం నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. చిన్నంబావి వాసులకు సాగునీటి కష్టాలకు శాశ్వతంగా దూరం చేసేందుకు సింగోటం-గోపాల్దిన్నె లింక్ కెనాల్కు రూ.140 కోట్లు మంజూరు చేశామని చే శామని, ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి స్వస్థలంలోనే డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం సబ్స్టేషన్ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఎంపీ రాము లు మాట్లాడుతూ సోమశిల-సిద్ధేశ్వరం వంతెన ని ర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. డీపీఆర్ పూర్తయి, సర్వే ప్రారంభించినట్లు చెప్పారు.
రూ.600 కోట్లతో వంతెన, రూ.600 కోట్లతో కల్వకుర్తి-నాగర్కర్నూల్-కొల్లాపూర్ మీ దుగా హైవే నిర్మించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ దీన్దయాళ్ పథకంలో భా గంగా రూ.1.80 కోట్లతో అమ్మాయిపల్లి, బెక్కెం గ్రామాల్లో సబ్స్టేషన్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఆంధ్రా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ని ర్వాసిత ఉద్యోగులను రాష్ర్టానికి రప్పించడానికి ప్రభుత్వం అనుమతించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నేత సీఆర్ జగదీశ్వర్రావు, కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఎంపీపీ సోమేశ్వరమ్మ, జెడ్పీటీసీ వెంకట్రామమ్మ, కొప్పునూరు విండో చైర్మన్ బగ్గారి నర్సింహారెడ్డి, వైస్ ఎంపీపీ పుష్పలత, సర్పంచులు చక్రధర్గౌడ్, పద్మ, ఎంపీటీసీలు మౌలాలి, గోవిందు శ్రీధర్రెడ్డి, నాయకులు చిదంబర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, చిన్నారెడ్డి, రాజేశ్వర్రెడ్డి, భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఈదన్నయాదవ్ పాల్గొన్నారు.
నిరంతర విద్యుత్తో సంబురంగా సాగు
రాష్ట్రంలో రైతులకు ని రంతరం విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, 24 గంటల విద్యుత్తో సాగు సంబురంగా సాగుతున్నదని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని బొల్లారంలో రూ. 1.5 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్ను ఎంపీ రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటా రు. అంతకుముందు మంత్రికి ఎంపీపీ కమలేశ్వర్రావు, జెడ్పీటీసీ మాధురి స్వాగతం పలికి సన్మానించారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం డబ్బులు కొందరికి అందలేదని రైతులు ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి రైస్ మిల్లర్ల యాజమాన్యాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కృష్ణయ్య, విండో చైర్మన్ రామన్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ కవిత, నాయకులు వేణుమాధవ్రెడ్డి, సురేందర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, మల్లయ్య, మౌలాలి, పాపయ్య, కృష్ణయ్య, సాయిబాబా పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయం..
రాష్ట్రంలోని పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన పల్లెబస చేపట్టి గురువారం ఉదయం పలు కాలనీల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అలా గే అప్పారెడ్డిపల్లి, పర్వతాపూర్, గట్టుకాడిపల్లి గ్రా మాల్లో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలను పర్యవేక్షించారు. గట్టుకాడిపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేసి పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. రూ.3 కోట్లతో చేపట్టిన గట్టుకాడిపల్లి-మానాజీపేట, రూ.4.70 కోట్లతో చేపటిటన అ ప్పారెడ్డిపల్లి-ఆముదంబండతండా బీటీ పనుల కు, అప్పారెడ్డిపల్లి వాగుపై రూ.కోటీ 20 లక్షల బ్రి డ్జి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. మండల కేంద్రంలోని యూత్ బిల్డింగ్, అండర్గ్రౌండ్ డ్రైనేజీకి భూమిపూజ, శ్మశాన వాటికను ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏండ్ల తరబడి కాని పనులను కూడా తెలంగాణ ఏర్పడ్డాక ప్రతి పనిని చేస్తూ ముందుకెళ్తున్నదని తెలిపారు. గతం లో రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి కి కొత్త కార్డులు త్వరలోనే అందిస్తామన్నారు. 57 ఏండ్లు నిండిన పేదలకు వచ్చే నెల నుంచి పింఛన్ను అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పేదకు డబుల్బెడ్రూం ఇళ్లు కట్టుకునేందుకు సొం త జాగాలోనే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పల్లెప్రగతితో గ్రామాలను శుభ్రం చేసుకొని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎం పీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, పార్టీ మండలాధ్యక్షుడు కృష్ణయ్య, వనపర్తి మార్కెట్ క మిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, విండో అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.