వెంగళరావునగర్, సెప్టెంబర్ 20 : తన భర్తకు సకాలంలో చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ.. ఓ ప్రైవేటు వైద్యశాలపై కానిస్టేబుల్ భార్య ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి అమీర్పేట్ సారథి స్టూడియో వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్కులకర్ణి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రేయ తన వాహనంలో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడిని పరీక్షించిన వైద్యుడు.. తదుపరి వైద్యం అందించాలంటే..సీటీ స్కాన్కు రూ. 4వేలు చెల్లించాలని, ఆ తర్వాతే చికిత్స ప్రారంభిస్తామని చెప్పాడు.
బాధితుడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అని, తక్షణం అత్యవసర వైద్యం అందించాలని డీసీపీ చౌహాన్, ఏసీపీ పీజీరెడ్డి చెప్పినా.. దవాఖాన సిబ్బంది వినిపించుకోలేదు. అప్పటికే 45 నిమిషాలు గడిచిపోవడంతో చేసేది లేక బాధితుడిని అంబులెన్స్లో బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లారు. కాగా, తన భర్తకు సకాలంలో వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేసిన దవాఖానపై చర్యలు తీసుకోవాలని సురేశ్ కులకర్ణి భార్య శాంతి కులకర్ణి సోమవారం ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు.