సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ) : పెట్రోలింగ్ ఆఫీసర్లు హైదరాబాద్ పోలీసులకు బ్రాండ్ అంబాసిడర్లని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. మంగళవారం వీఆర్ లోకల్ ఇండ్రస్ట్రీస్ సహకారంతో నగర పోలీస్ కమిషనరేట్కు చెందిన పెట్రోలింగ్ వాహనాలకు నిజాం కాలేజీ గ్రౌండ్లో శానిటైజేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బెస్ట్ విజుబుల్లో పెట్రోలింగ్ సిబ్బంది ఉంటారని, దూరం నుంచి పెట్రోలింగ్ కారును చూస్తే ఎవరికైనా ధైర్యం వస్తుందన్నారు. కరోనా కారణంగా గత 15 నెలలుగా పోలీసులు నిరంతరం పనిచేస్తున్నార న్నారు. ప్రతి శని, ఆదివారాల్లో శానిటైజేషన్ చాలా ముఖ్యం అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, ప్రతి రెండు గంటలకు చేతులు సబ్బుతో కడుక్కోవాలని పెట్రోలింగ్ అధికారులకు సూచించారు.