ఖైరతాబాద్, : జల వనరులను జాగ్రత్తగా వాడుకుంటేనే మానవాళికి మనుగడ సాధ్యమవుతుందని ప్రిన్సిపల్ సెక్రటరీ, జలమండలి ఎండీ దాన కిశోర్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోమవారం ది ఇని స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంట ర్, జలమండలి ఇంజినీర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వ ర్యంలో ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన దాన కిశోర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు అందుబాటు లో ఉన్న నీటిని ఇష్టానుసారంగా వాడితే భవిష్యత్లో నీటి ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. దేశంలో అధిక జనాభా ఉండి, అందుకు సరిపడా నీటి వనరులు లేవన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక విజన్తో రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా ముందు చూపుతో వ్య వహరిస్తూ ‘మిషన్ కాకతీయ, కాళేశ్వరం, అర్బన్ మిషన్ భగీ రథ’ లాంటి బృహత్తర కార్య క్రమాలకు శ్రీకారం చుట్టార న్నారు. మంచినీటిని ఇంటిం టికీ అందించడంలో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపారన్నారు. సింగపూర్, ఇజ్రాయెల్ వంటి నీటి వనరు లు తక్కువగా ఉన్న దేశాల్లో నీటిని చాలా పొదుపుగా వాడు తారని, అధికంగా నీటిని వృథా చేస్తే భవిష్యత్తో నీటి కష్టా లు తప్పవన్నారు. ఐఈఐ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఆపరేషన్స్-1) అజ్మీరా కృష్ణ, డైరెక్టర్ (రెవెన్యూ) వీఎల్ ప్రవీణ్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ డి.శ్రీధర్ బాబు, టెక్నికల్ డైరెక్టర్ పి.రవి కుమార్, డైరెక్టర్ (ఆపరేషన్-2) ఎం.స్వామి, టి.అంజయ్య, ప్రొ॥ రమణా నాయక్ పాల్గొన్నారు.