జయశంకర్ భూపాలపల్లి : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టి హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిస్తోంది. అయితే కొన్నిచోట్ల కొందరు వ్యక్తులు ఆ చెట్లను నరుకుతున్నారు. దీంతో ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్నది. తప్పు చేసిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నది.
తాజాగా జిల్లాలోని చిట్యాల మండలం భావుసింగ్ పల్లి గ్రామంలో హరితహరంలో భాగంగా నాటిన మొక్కను చెంచు కాలనీకి చెందిన మేకల రమేష్ అనే వ్యక్తి నరికివేశాడు. హరితహారంలో భాగంగా అతడి ఇంటి ముందు పెట్టిన మొక్క కాస్త వృక్షంగా మారి చల్లని నీడనిస్తున్నది. అయితే చాలా మంది తమ బైక్లను తన ఇంటి ముందున్న చెట్టుకింద పెడుతున్నారనే ఆగ్రహంతో చెట్టును నరికేశాడు.
ఇందుకు గాను పంచాయతీ కార్యదర్శి కృష్ణకాంత్ రమేష్కు రూ.4,000 జరిమానా విధించారు. మళ్లీ ఇలాంటి చర్యలు పునరావృతం ఐతే చట్ట ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు
భారత్కు చేరిన అమెరికా అత్యవసర సాయం