హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రగతిభవన్కు చేరుకున్నారు. 20 రోజులపాటు తన వ్యవసాయక్షేత్రంలో హోం ఐసొలేషన్లో ఉన్నారు. ఏప్రిల్ 19న స్వల్ప లక్షణాలు బయటపడటంతో సీఎం కేసీఆర్ వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకుంటూ హోం ఐసొలేషన్లోకి వెళ్లారు. వ్యక్తిగతవైద్యుడు డాక్టర్ ఎంవీ రావు పర్యవేక్షణలో ఆయనకు కరోనా ట్రీట్మెంట్ నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటిజెన్తోపాటు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఇతర రిపోర్టులు కూడా సాధారణంగా ఉండటంతో సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు.