వనస్థలిపురం, సెప్టెంబర్ 1 : మౌలిక పెట్టుబడులు, వైద్య రంగానికి హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. బీఎన్రెడ్డినగర్లో నూతనంగా ఏర్పటు చేసిన గూగీ ప్రాపర్టీస్, కనెక్ట్ డయాగ్నటిక్ సెంటర్లలను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్లో మహానగరం ముందంజలో ఉందన్నారు.
తెలంగాణ ప్రభ్వుం చొరవతో రాష్ట్రంలో వైద్య రంగం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. నూతనంగా ప్రారంభించిన రెండు సంస్థల యాజమాన్యం, నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీఎన్రెడ్డినగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, గూగీ ప్రాపర్టీస్ ఎండీ షేక్ అక్బర్, కనెక్ట్ డయాగ్నస్టిక్ సెంటర్ ఎండీ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ చౌదరి, గంగం శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.