ముంపు ప్రాంత ప్రజలను తరలించాలి

జియాగూడ: జియాగూడ వందఫీట్ల బైపాస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులను హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. బుధవారం జియాగూడ డివిజన్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాలను కార్పొరేటర్ మిత్రకృష్ణ, ఆసీఫ్నగర్ తహసీల్దార్ నవీన్, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్రెడ్డి, ఇతర అధికారులతో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
నదీం కాలనీలో..
మెహిదీపట్నం: కార్వాన్ నియోజకవర్గంలోని నదీం కాలనీలో కలెక్టర్ శ్వేతామహంతి పర్యటించారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే కౌసర్ మోయినుద్దీన్ కలిసి వరద ముంపు బాధితులను పరామర్శించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముంపు ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
తాజావార్తలు
- అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు.. పీపీఈ కిట్లో అనుమానితుడు
- రోదసీలో అడుగిడిన యూరి గగారిన్ జయంతి.. చరిత్రలో ఈరోజు
- తన కుక్కల్ని వైట్హౌజ్ నుంచి పంపించేసిన బైడెన్
- రాహుల్కే పార్టీ పగ్గాలు : యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో తీర్మానం!
- కొండగట్టు అంజన్న భక్తుల కొంగు బంగారం : ఎమ్మెల్సీ కవిత
- గుడ్న్యూస్.. కొవాగ్జిన్ సేఫ్ అని తేల్చిన లాన్సెట్
- ఉభయసభలకు పెట్రో సెగ.. 2 వరకు వాయిదా
- వాళ్లను జైలుకు పంపకుండా విడిచిపెట్టను: బీజేపీ ఎమ్మెల్యే
- రణ్బీర్ కపూర్కు కరోనా పాజిటివ్
- రూ.12 వేలు తగ్గిన బంగారం: పెట్టుబడికి ఈ టైం సరైందేనా?!