న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి భార్య లక్ష్మీ మురుదేశ్వరి పురిపై సామాజిక కార్యకర్త సాకేత్ గోఖేల్ ఇటీవల కొన్ని వివాదాస్పద ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్ల విషయంలో లక్ష్మీ పురి కోర్టును ఆశ్రయించారు. తప్పుడు ట్వీట్లు చేసిన సాకేత్ 5 కోట్లు చెల్లించాలంటూ పరువునష్టం కేసు ఫైల్ చేశారు. ఈ కేసును ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో కార్యకర్త సాకేత్ గోఖలేకు కోర్టు వార్నింగ్ ఇచ్చింది. లక్ష్మీ పురిపై చేసిన ట్వీట్లను 24 గంటల్లో తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జస్టిస్ సీ హరిశంకర్ తన తీర్పులో తెలిపారు. ఒకవేళ ట్వీట్లను తొలగించకుంటే.. ట్విట్టర్ సంస్థే వాటిని డిలీట్ చేస్తుందన్నారు. స్విట్జర్లాండ్లో కొన్ని ప్రాపర్టీలు కొన్నట్లు లక్ష్మీపురిపై జూన్ 13, 26వ తేదీల్లో ట్వీట్లు చేశారు. తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కేంద్ర మంత్రి భార్య కోర్టులో కేసు వేశారు.