కాచిగూడ,సెప్టెంబర్ 1 : రద్దీగా ఉన్న పలు రైల్వేస్టేషన్లలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాచిగూడ రైల్వేపోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు వివరాలను వెల్లడించారు. ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం రావుల చెరువు ప్రాంతానికి చెందిన లక్ష్మణ్రావు కుమారుడు సత్యాప్రసాద్(35) వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. ఉదయం, రాత్రి సమయాల్లో రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ల్లో ఫోన్ మాట్లాడుతున్న ప్రయాణిలు, రద్దీ ప్రదేశాల్లో సెల్ఫోన్లను దొంగలిస్తుంటాడు.
దొంగిలించిన సెల్ఫోన్లను అమ్ముకుంటూ తాగుతూ జల్సాలు చేస్తుంటాడు.
రెండు రోజుల క్రితం కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారం-1పై రైలు ఎక్కుతుండగా ప్రయాణికురాలి బ్యాగులోంచి ఖరీదైన సెల్ఫోన్ను దొంగిలించాడు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాచిగూడ రైల్వే పోలీసులు కాచిగూడ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేస్తుండగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చి పోలీస్స్టేషన్కు తరలించారు. ఆతను చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని సత్యాప్రసాద్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.