హైదరాబాద్ : నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లోని కంప్యూటర్లు, ఏసీని దొంగలు అపహరించారు. అఫ్జల్ గంజ్ పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లోకి ప్రవేశించిన దొంగలు.. అక్కడున్న రెండు కంప్యూటర్లను, ప్రింటర్, ప్రొజెక్టర్, ఏసీతో పాటు ఇతర వస్తువులను దొంగిలించారు. అయితే ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ రూమ్ డోర్ సరిగా లేదు. దీంతో ఆ డోర్ నుంచే దొంగలు లోపలికి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్థోపెడిక్ విభాగం ఓల్డ్ బ్లాక్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అయితే అక్కడ ఎలాంటి సెక్యూరిటీ కానీ, సీసీ కెమెరాలు కానీ లేవని పోలీసుల విచారణలో వెల్లడైంది.