వనస్థలిపురం, సెప్టెంబర్ 8 : గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 12మందిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి, వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం. బ్మాహ్మణపల్లి టీచర్స్ కాలనీ ప్లాట్ నెం 240లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడిచేశారు.
అక్కడ పేకాడుతున్న పెరుమళ్ల జంగారెడ్డి(53), చిన్రెడ్డి రమేష్రెడ్డి(40), లిక్కి గున్నారెడ్డి(50), యంపాల సుధాకర్రెడ్డి(39), ఎద్దుల రామేశ్వర్రెడ్డి(56), నాంపల్లి కొండల్(48), బృంగి విజయ్కుమార్(55), అల్లి నర్సింహ్మారెడ్డి(40), అలుగువెల్లి భాస్కర్రెడ్డి(50), మర్రి రాజిరెడ్డి(36), యాసరాని మోహన్రెడ్డి(60), గంట ఉపేందర్రెడ్డి(41)లను అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి రూ.21,280 నగదు, 11సెల్ ఫోన్లు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.