బొల్లారం,ఆగస్టు 11 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈ నెల 13 నుంచి 17 వరకు సికింద్రాబాద్ మిలటరీ స్టేషన్లోని ఆర్మీ రోడ్లన్నీ మూసివేయనున్నట్లుగా ఆర్మీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సురక్షితంగా నిర్వహించడానికి అన్నీ సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు పై విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని కోరారు.