హైదరాబాద్ : లంగర్హౌజ్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ వాజీ ఉజ్మాకు బెదిరింపు కాల్ వస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత కొద్ది రోజుల నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని కార్పొరేటర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసభ్యకరంగా పదజాలంతో దూషిస్తున్నట్లు తెలిపాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే చంపుతానని ఆ అగంతకుడు బుధవారం ఫోన్ చేశాడని కార్పొరేటర్ పేర్కొన్నాడు. కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.