ట్యాంక్ బండ్ అందాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. నగరం బొడ్డునున్న హుస్సేన్సాగర్ చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టిన హెచ్ఎండీఏ ప్రత్యేకంగా డిజైన్లను రూపొందించి, వాటిని ఒక్కొక్కటిగా ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే ట్యాంక్బండ్పై కొత్తగా ఏర్పాటు చేసిన వెయిటింగ్ లాంజ్ను, ఫుట్పాత్ ఫొటోను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ట్యాంక్బండ్ మీదు గా ఉండే సూర్యాస్తమయం సరికొత్త అనుభూతిని ఇస్తుందని ట్వీట్ చేశారు.