హుస్సేన్సాగర్కు ముప్పు లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి గతేడాది భారీ వర్షాలతో సాగరానికి ఎలాంటి ప్రమాదం రాలేదు.కానీ తెలంగాణ ప్రభుత్వం ముందుచూపు ప్రదర్శించింది. ఒకవేళ ఊహించని వరద వస్తే… ముందు జాగ్రత్త చర్యగా రూ.66 కోట్లతో రెండు కీలకమైన పనులు చేపట్టనుంది. రూ.41 కోట్లతో సాగర్కు గేట్లు అమర్చి.. తద్వారా భారీ వరదలొచ్చినపుడు సాఫీగా నీళ్లు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం రూ.25 కోట్లతో కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనుంది.