కాచిగూడ, జూన్ 13: న్యాయ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జీవిత విశేషాలు, న్యాయ వ్యవస్థలో తీసుకురావలసిన మార్పులు, మరిన్ని సంస్కరణలను పొందుపరుస్తూ రూపొందించిన “భారత న్యాయ దిగ్గజం” పుస్తకాన్ని మానవ హక్కుల కమిషన్ ప్రచార సభ్యుడు, ముద్ర మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తిప్పినేని రామదాసప్ప నాయుడు ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రయ్య ఆవిష్కరించారు. ఆదివారం బర్కత్పుర ముద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘భారత న్యాయ దిగ్గజం’ పుస్తకాన్ని ముద్రించిన రామదాసప్ప నాయుడుని జస్టిస్ చంద్రయ్య ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కలిసి భారత న్యాయ దిగ్గజం పుస్తకాన్ని అందజేయనున్నట్లు జస్టిస్ చంద్రయ్య వెల్లడించారు.