హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం రాత్రి భారీ వాన కురిసింది. మూడు గంటలపాటు కుండపోతగా వర్షం కురవడంతో జంట జలాశయాల్లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో హిమాయత్ సాగర్లోకి 500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటికే చెరువు పూర్తిగా నిండి ఉండటంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 1400 క్యూసెక్కుల నీటిని దిగువకు విదుల చేస్తున్నారు. హిమాయత్సాగర్లో ప్రస్తుతం 1762 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.5 అడుగులు.
ఇక ఉస్మాన్సాగర్లోకి 250 క్యూసెక్కుల నీరు వస్తున్నది. చెరువులో ప్రస్తుతం 1788.5 అడుగుల వద్ద నీరు ఉన్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు.