చార్మినార్, మే 25: శాలిబండ డివిజన్లోని రాజస్థాన్ చారిటబుల్ పాఠశాలను నిర్వాహకులు కొవిడ్ ఐసొలేషన్ కేంద్రంగా తీర్చిదిద్దారు. మంగళవారం దీన్ని హోం మంత్రి మహమూద్ అలీ, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్తో కలిసి ప్రారంభించారు. అనంతరం, హోం మంత్రి అందులో ఏర్పాట్లను పరిశీలించారు. వైద్యులతో పాటు పారా మెడికల్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని, ప్రతి పడకకు ఆక్సిజన్ సిలిండర్ను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాజస్థాన్ చారిటబుల్ ట్రస్టీ సభ్యులు, శాలిబండ కార్పొరేటర్ ముజఫర్ అలీ, టీఆర్ఎస్ ఘాన్సీబజార్ డివిజన్ నేత దిపాంకర్ పాల్ పాల్గొన్నారు.