మహేశ్వరం, మే 30 : సరూర్నగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు ఈశ్వరయ్య సేవలను గుర్తించిన పెండ్యాల గ్రామస్తులు.. ఆదివారం ఆయనను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత రాజేశ్ మాట్లాడుతూ పెండ్యాల గ్రామ వాస్తవ్యులు మంత్రి ఈశ్వర్ వివిధ కారణాలతో చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆరుగురిని కాపాడి వారికి పునర్జన్మనందించారు. ప్రజల ప్రాణానికి రక్షణ కల్పిస్తున్న ఆయనకు ఆయురారోగ్యాలు కల్పించాలని దేవుడిని వేడుకున్నాడు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.