సిటీబ్యూరో, జూలై 6 (నమస్తేతెలంగాణ): నల్లా కనెక్షన్దారులకు ఊరట. ఉచిత తాగునీటి పథకం లబ్ధి పొందేందుకు ఇచ్చిన గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. గ్రేటర్వ్యాప్తంగా వివిధ కారణాల వల్ల అపార్ట్మెంట్లు, గృహ వినియోగదారులు ఆధార్ అనుసంధానం చేసుకోలేదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం అనుసంధానం గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది. ఈ మేరకు మంగళవారం పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉచిత తాగునీటి పథకం లబ్ధి పొందాలంటే నల్లాకు మీటర్ తప్పనిసరి. పంద్రాగస్టు వరకు తాగునీరు, సీవరేజి బిల్లులను జలమండలి నిలిపివేయనుంది. బస్తీల్లో నివాసముంటున్న వారు తమ కనెక్షన్కు మీటరు బిగించుకోవాల్సిన అవసరం లేదు. ఆధార్ లింక్ చేసుకోని వినియోగదారులకు ఆగస్టు 15 తర్వాత బిల్లులు జారీ చేస్తారు. వారు 2020 డిసెంబర్ నుంచి ఆగస్టు 31 వరకు అంటే 9 నెలల బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వీరికి ఎలాంటి వడ్డీ, జరిమానా విధించరు. నల్లా కనెక్షన్కు ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటే మీ సేవ కేంద్రం లేదా జలమండలి వెబ్సైట్ను (www.hyderabadwater.gov.in) సంప్రదించొచ్చు. మరింత సమాచారం కోసం జలమండలి టోల్ఫ్రీ నంబర్ 155313ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.