సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ):నగర శివారులోని జంట జలాశయాలకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు (2.97 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1762.75 (2.773 టీఎంసీలు) ఉందని, 1,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, మూడు గేట్లను ఒక అడుగు ఎత్తడంతో 1,030 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుందని జలమండలి అధికారులు తెలిపారు. అలాగే ఉస్మాన్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790.00 అడుగులు (3.90 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1784.80 అడుగులు (2.800 టీఎంసీలు) ఉందని, 200 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని, రెండు మూడు రోజుల్లో ఉస్మాన్సాగర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.