సౌథాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఏ టీమ్కైనా కాస్త సపోర్ట్ ఉందా అంటే అది ఇండియాకే. మ్యాచ్కు వర్షం పదే పదే అడ్డుపడుతున్నా.. కోహ్లి సేనకు మద్దతుగా ప్రతి రోజూ ఇండియన్ ఫ్యాన్స్ స్టేడియానికి వస్తున్నారు. టీమ్ను చీర్ చేస్తున్నారు. అయితే ఐదో రోజు ఆటలో మాత్రం కొందరు అభిమానులు హద్దు మీరారు. న్యూజిలాండ్ ప్లేయర్స్పై నోరు పారేసుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో సెక్యూరిటీ టీమ్ వెంటనే ఆ అభిమానులను బయటకు పంపించేసింది. ఈ విషయాన్ని ఆట ముగిసిన తర్వాత ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
న్యూజిలాండ్ ప్లేయర్స్పై నోరు పారేసుకున్నట్లు మాకు ఫిర్యాదు అందింది. మా సెక్యూరిటీ వెంటనే వాళ్లను గుర్తించి బయటకు పంపించేసింది. క్రికెట్లో ఇలాంటి తీరును సహించేది లేదు అని ఆ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ఘటన గురించి న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సౌథీని అడగ్గా.. నేనూ ఇప్పుడే దీని గురించి విన్నాను. ఫీల్డ్లో ఆటను మంచి స్పిరిట్తో ఆడాలి అని అన్నాడు.