కాచిగూడ,జూన్ 13: ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బుద్వేల్,శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన సుధాకర్ కుమారుడు గౌని ప్రవీణ్(19) ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం రాత్రి బుద్వేల్ రైల్వేస్టేషన్లో పెట్రోల్ ట్యాంకర్ గూడ్స్రైలు ఆగిఉంది. ప్రవీణ్ రైల్వేస్టేషన్ ఒకటవ ప్లాట్ ఫారం నుంచి రెండవ ప్లాట్ ఫారంపైకి వెళ్లడానికి పెట్రోల్ ట్యాంకర్పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపర్చుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.