లాహోర్: పాకిస్థాన్లోని ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత ఐ ఏ రెహమాన్ (90) సోమవారం కన్నుమూశారు. మధుమేహం, బీపీ తదితర సమస్యలతో ఆరోగ్యం క్షీణించి ఆయన మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అవిభక్త భారత్లోని హర్యానాలో 1930లో రెహమాన్ జన్మించారు. పాక్లోని క్రైస్తవులు, హిందువులు వంటి మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారానికి ఎనలేని సేవలు అందించారు.