షేక్పేట మండల పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.14లో సుమారు రూ.200కోట్ల విలువైన 2.10ఎకరాల భూ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. సర్వే నంబర్ 403లోని ఈ స్థలం ప్రభుత్వానిదే అంటూ 1998లో సిటీ సివిల్ కోర్టులో తీర్పు రాగా.. ఈ స్థలం తమదంటూ న్యాయపోరాటం చేస్తున్న బాదం రంగస్వామి హైకోర్టును ఆశ్రయించాడు.మూడురోజుల క్రితం అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది.దీంతో అక్కడ పను లు ప్రారంభించారు. స్థలం విషయంలో హైకోర్టులో బాదం రామస్వామికి అనుకూలంగా తీర్పు రావడంతో రెవెన్యూశాఖకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తామని, సుప్రీంకోర్టులో అప్పిల్ చేస్తామని షేక్పేట మండల తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
ఇదిలాఉండగా.. ఆదినుంచి అనేక వివాదాలకు కారణమైన ఈ భూమిని దక్కించుకునేందుకు ఎంతో మంది తప్పు డు పత్రాలు సృష్టించి పలుమార్లు ఆక్రమణలకు పాల్పడ్డారు. ఈ స్థలంలో 4865 గజాల స్థలాన్ని తన తండ్రి 1969లో కొనుగోలు చేశాడంటూ సయ్యద్ అబ్దుల్ ఖాలిద్ అనే వ్యక్తి రంగంలోకి దిగాడు.ప్రభుత్వానికి, రంగస్వామికి మధ్యన హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఇదే స్థలంపై తప్పు డు పత్రాలను సృష్టించిన ఖాలిద్ ఏకంగా ప్రభుత్వ అధికారులను, ఏసీబీ అధికారులను బురిడీ కొట్టించి తప్పుడు ఫి ర్యాదులు ఇచ్చాడు.ఈ స్థలంలో బోర్డు ఏర్పాటు చేసి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న ఖాలిద్పై అప్పట్లో షేక్పేట తహసీల్దార్ సుజాత (గత ఏడాది) క్రిమినల్ కేసులు నమో దు చేయించారు.
ఈ స్థలం విషయంలో తమకు అనుకూలంగా నివేదిక ఇస్తే లంచం ఇస్తానంటూ షేక్పేట ఆర్ఐ నాగార్జునరెడ్డికి రూ.15లక్షలు ఇచ్చిన ఖాలిద్.. అతడితో పాటు తహసీల్దార్ సుజాతను గత ఏడాది జూన్లో ఏసీబీకి పట్టించాడు.ఈ స్థలం వివాదంలో తనపై నమోదైన కేసుల్లో సాయం చేయాలంటూ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు చెంది న ఎస్ఐ రవీందర్కు రూ.1.5లక్షలు లంచం ఇచ్చిన ఖాలిద్ అతడిని కూడా ఏసీబీకి పట్టించారు. అతడు సమర్పించిన పత్రాలన్ని బోగస్ అని తేల్చిన ఏసీబీ అధికారులు.. తప్పుదోవ పట్టించిన ఖాలిద్పై సీసీఎస్లో ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదైంది. ఇదే తరహాలో ఖాలిద్ గతంలో కూడా ఫోర్జరీ పత్రాలతో భూమిని ఆక్రమించాడని తేలడంతో అతడిపై పీడీయాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.