హైదరాబాద్: నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మత్తుమందు పట్టుబడింది. సోమవారం ఉదయం టాంజానియా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి నుంచి డీఆర్ఐ అధికారులు పెద్దమొత్తంలో హెరాయిన్ను పట్టుకున్నారు. దీనివిలువ సుమారు రూ.20 కోట్లు ఉంటుందని చెప్పారు. అతను టాంజానియా దేశస్థుడని, అతనిపేరు జాన్ విలియమ్స్ అని తెలిపారు. హెరాయిన్ను ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారే విషయాలను గురించి అధికారులు నిందితుడిని ఆరాతీస్తున్నారు.
శంషాబాద్లో భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను పట్టుకోవడం ఈనెలలో ఇది రెండోసారి. ఈనెల 5న జాంబియాకు చెందిన ఇద్దరు మహిళల నుంచి రూ.78 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.