సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) ః రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుంలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఇందులో బాగంగానే హైదరాబాద్ మహానగర సంస్థ పరిధిలో కూడా భూముల విలువలతో పాటు స్టాంపు డ్యూటీని 6శాతం నుంచి 7.5శాతంకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించి సెంట్రల్ సర్వర్ సాఫ్ట్వేర్ను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నా.. కూడా పెరిగిన ధరలు వర్తిస్తాయి. అలాగే ఓపెన్ ప్లాట్ల చదరపు గజం కనీస ధర రూ. 100 నుంచి రూ. 200లకు పెంచిన ప్రభుత్వం..స్లాబుల వారీగా 50శాతం, 40 శాతం, 30 శాతం లెక్కన మూడు స్లాబుల్లో ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువలను పెంచినట్లు ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలాగే అపార్ట్మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు కనీస విలువ రూ.800 నుంచి రూ.1000కి పెంచగా..చదరపు అడుగుపై 20శాతం, 30శాతం లెక్కన పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
హెచ్ఎండీఏ ఏరియా-1