కింగ్కోఠి ప్రభుత్వ దవాఖానలో సేవలు, సౌకర్యాలపై ఎప్పటికప్పుడు సమాచారం తెలిపేందుకు శనివారం హెల్ప్డెస్క్ ప్రారంభమైంది. దీని ద్వారా దవాఖానకు వచ్చే వారికి బెడ్స్, వెంటిలేటర్స్, ఐసీయూ బెడ్స్ వంటి వివరాలను తెలియజేస్తున్నారు. జీహెచ్ఎంసీతో సమన్వయపర్చుకుని పార్థివదేహాలను తరలిస్తున్నారు. 9490616536 కు ఫోన్ చేస్తే..ప్రతిరోజూ డిశ్చార్జి అయిన రోగుల వివరాలతో పాటు దవాఖానకు దగ్గరలో ఉన్న డయగ్నాస్టిక్ కేంద్రాల వివరాలను తెలియపరుస్తున్నారు.
వ్యాక్సినేషన్, ఓపీ, డయాలసిస్ కోసం వచ్చే వారికి ఈ హెల్ప్ డెస్క్ సహాయపడుతుంది. త్వరలోనే ఈ హెల్ప్ డెస్క్ ద్వారా ఉచిత ఫోన్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఐఏఎస్ స్పెషల్ సెక్రటరీ టీఆర్ అండ్ బీ స్పెషల్ ఆఫీసర్ విజీంద్రబోయి, కింగ్ కోఠి ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డా.రాజేంద్రనాథ్లు ఈ హెల్ప్ డెస్క్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్మాణ్ ఓఆర్జీ సంస్థ 20 ఆక్సిజన్ కాన్సిడేటర్ పరికరాలను కింగ్కోఠి దవాఖానకు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దవాఖాన అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ జలజ, నోడల్ అధికారి డాక్టర్ మల్లిఖార్జున్, ఆర్ఎంవో డాక్టర్ విరజ, స్టోర్ ఇంచార్జి షాహిదా, నారాయణగూడ ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.