హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖాధికారులు తెలిపారు. బంగాళాకాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణపై ఉంటుందని పేర్కొన్నారు. తద్వారా హైదరాబాద్పై కూడా ద్రోణి ప్రభావం ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.