హైదరాబాద్ : నగరంలోని మలక్పేట, అంబర్పేట ఏరియాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి ముసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. మలక్పేట్లోని ఆయా కాలనీల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.