హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, హయత్నగర్తోపాటు నగరంలోని చార్మీనార్లో భారీగా వాన కురిసింది. అత్యధికంగా బహదూర్పురాలో 9 సెంటీమీటర్లు, చార్మినార్లో 5.5 సెంటీమీటర్లు, సైదాబాద్లో 4 సెంటీమీటర్లు, ఝాన్సీబజార్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. అదేవిధంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో భారీ వర్షం కురింసింది. మహబూబాబాద్లో కూడా వాన పడింది.
కాగా, హైదరాబాద్లో ఒక్కసారిగా వాన కురవడంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతున్నది. భారీ వానతో రోడ్లపై నీరు నిలువకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు జాగ్రత్తపడుతున్నారు.