ఆమనగల్లు, మే 20: కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందు లకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆమనగల్లు మార్కె ట్ కార్యాలయం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యం తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో ఆకాల వర్షాలతో ధాన్యం తడువకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశిం చా రు. గన్నీ బ్యాగులు కొరతతో కొనుగోలు మందగిస్తున్నదని రైతులు తనదృష్టికి తీసుకువచ్చారన్నారు. బ్యాగుల కొరతను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాలని మార్కెట్ కార్యదర్శి శ్రీశైలంకు సూచించారు. రైతులు దళారులను నమ్మి ఇబ్బం దులు పడొద్దన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అహ ర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.
వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి
పట్టణంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ దవాఖానను ఎమ్మెల్సీ సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అం దించాలని ఆయన కోరారు. దవాఖానలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రికార్డులను తనిఖీ చేసి కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ పక్రియకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగితెలుసుకొన్నారు. లాక్డౌన్ విధి గా పాటించాలన్నారు. లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయిం చుకుని మందులు వాడాలన్నారు. ఎమ్మెల్సీతో పాటు ఎంపీపీ అనిత, టీఆర్ఎస్ నాయకులు విజయ్, బాబా ఉన్నారు.